- రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ
హైదరాబాద్, వెలుగు: కేవలం రాజకీయ లబ్ది కోసం ప్రధాని మోదీ మహిళలపై కపట ప్రేమ చూపిస్తున్నారని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ విమర్శించారు. సోమవారం ఆమె గాంధీ భవన్లో మీడియా తో మాట్లాడారు.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మహిళల నుంచి బీజేపీకి ముప్పు ఉందని గమనించిన మోదీ..ఈ నెల 16 న మహిళా బిల్లును తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 40 ఏళ్ల క్రితమే రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు చర్చను ప్రారంభించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.

