కేంద్రం నో చెప్పినా.. సింగరేణి కుర్చీ వదలని శ్రీధర్

కేంద్రం నో చెప్పినా.. సింగరేణి కుర్చీ వదలని శ్రీధర్

రూల్స్​కు విరుద్ధంగా ఆర్డినరీ రెజల్యూషన్​తో ఎక్స్​టెన్షన్

కోల్​మినిస్ట్రీ వ్యతిరేకించినా ఇంకా సీఎండీ  పోస్టులోనే..

ఇప్పటికే ఆరేళ్లు పూర్తయినా మళ్లీ కొనసాగింపు

ఇది కేంద్రాన్ని ధిక్కరించడమే అంటున్న ఎక్స్​పర్ట్స్​

వెలుగు, నెట్​వర్క్​:  సింగరేణి సీఎండీగా  ఎన్​. శ్రీధర్​ను కంటిన్యూ చేసేందుకు కేంద్రం నో చెప్పినా ఆయన మాత్రం తన కుర్చీ దిగట్లేదు. ఇటీవల కొత్తగూడెంలోని కంపెనీ హెడ్డాఫీస్​లో  జరిగిన యాన్యువల్​ జనరల్​ బాడీ మీటింగ్ లో  శ్రీధర్​ ఎక్స్​టెన్షన్​ కోసం పెట్టిన రెజల్యూషన్​ను సెంట్రల్​ కోల్​ మినిస్ట్రీ ప్రతినిధి వ్యతిరేకించారు.  సీఎండీగా శ్రీధర్​ను కంటిన్యూ చేయడం కేంద్రానికి ఇష్టం లేదని స్పష్టంగా చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సాయంతో ఆర్డినరీ రెజ్యులైషన్​ పాస్​ చేయించుకొని పదవిలో కొనసాగుతున్నారు. రూల్స్​కు వ్యతిరేకంగా పెట్టిన ఈ తీర్మానం చెల్లదని ఎక్స్​పర్ట్స్​ పేర్కొంటున్నారు.

పక్కా ప్లాన్​ ప్రకారమే ఆర్డినరీ రెజల్యూషన్​..

డిసెంబర్​30న కొత్తగూడెంలోని హెడ్​ఆఫీస్​లో సింగరేణి కాలరీస్​ కంపెనీ యాన్యువల్​జనరల్​బాడీ మీటింగ్​ నిర్వహించారు. ఈ మీటింగ్​కు స్టేట్​గవర్నమెంట్ తరపున కంపెనీలోని ముగ్గురు డైరెక్టర్లు, కంపెనీ సెక్రెటరీ, స్టేట్​ఎనర్జీ ఆఫీసర్ పాల్గొనగా, కేంద్రం తరుపున సెంట్రల్​ కోల్​మినిస్ట్రీ నుంచి అండర్​ సెక్రెటరీ ఆల్క శేఖర్​ హాజయ్యారు. 2019–20 ఫైనాన్షియల్​ఇయర్​కు సంబంధించి వివిధ  అంశాలపై చర్చించాక సీఎండీగా శ్రీధర్​ఎక్స్​టెన్షన్​కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఆర్డినరీ రెజల్యూషన్​ పెట్టించింది. ఈ రెజల్యూషన్​కు కోల్​మినిస్ట్రీ ప్రతినిధి ఆల్కశేఖర్ వ్యతిరేకంగా ఓటేసినప్పటికీ కంపెనీలోని ముగ్గురు డైరెక్టర్లు, సెక్రెటరీ, స్టేట్​ ఎనర్జీ  ఆఫీసర్ సాయంతో  పాస్​చేయించుకుంది.  వాస్తవానికి సీఎండీని ఎక్స్​టెన్షన్ చేయాలంటే స్పెషల్​ రెజల్యూషన్ ​పెట్టాలి. అది నెగ్గాలంటే అనుకూలంగా 70శాతం ఓట్లు పడాలి. సెంట్రల్​వాటా 49 శాతం కావడంతో, కోల్​మినిస్ట్రీ ప్రతినిధి అంతే శాతం ఓట్లతో సమానమైనందున తీర్మానం వీగిపోయినట్లేనని ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు. ఒకవేళ స్పెషల్​ రెజల్యూషన్​ను ఆర్డినరీ తీర్మానంగా మార్చాలంటే14 రోజుల ముందే కోల్​ మినిస్ట్రీ నుంచి ఆమోదం తీసుకోవాలి. కానీ ఎలాంటి ఆమోదం లేకుండా పెట్టిన ఆర్డినరీ రెజల్యూషన్​ కూడా స్పెషల్​ రెజల్యూషన్​గానే భావించి సీఎండీ దిగిపోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.  అదీగాక ట్రైపార్టెడ్​ అగ్రిమెంట్​ ప్రకారం సీఎండీని కొనసాగించాలాంటే కోల్​ మినిస్ట్రీ నుంచి పర్మిషన్​తప్పనిసరి అంటున్నారు. ఇలా  సింగరేణి చరిత్రలో ఓ సీఎండీ కొనసాగింపునకు వ్యతిరేకంగా కోల్​మినిస్ట్రీ ప్రతినిధి తొలిసారి ఓటేసినా శ్రీధర్​ మాత్రం​పదవిలో కొనసాగడంపై విమర్శలు వస్తున్నాయి.

గతంలోనే మూడుసార్లు ఎక్స్​టెన్షన్​..

2015 జనవరి 1న సింగరేణి సీఎండీగా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ పదవీకాలం నిజానికి 2016 డిసెంబర్ 31నే ముగిసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒకసారి రెండేళ్ల పీరియడ్​కు, రెండుసార్లు ఏడాది పీరియడ్​కు ఎక్స్​టెన్షన్​ ఇచ్చింది.  ఐదేళ్లకు మించి ఈ పదవిలో ఉండరాదని రూల్స్​ చెబుతున్నాయి. కానీ శ్రీధర్​ ఇప్పటికే సీఎండీ పదవిలో  ఆరేళ్లపాటు కొనసాగినా, తాజాగా మరోసారి ఎక్స్​టెన్షన్​ ఇవ్వడాన్ని ఎక్స్​పర్ట్స్​, ముఖ్యంగా కార్మిక సంఘాల నేతలు తప్పుపడుతున్నారు. కాగా, సీఎండీ శ్రీధర్​ అధికారపార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు కొంతకాలంగా వస్తున్నాయి.  తెలంగాణ జెన్​కో, ట్రాన్స్​కో నుంచి కంపెనీకి 10వేల కోట్లకు పైగా బకాయిలు​ రావాల్సి ఉన్నా, వాటిని రాష్ట్రప్రభుత్వం నుంచి ఇప్పించడంలో శ్రీధర్​ విఫలమయ్యారనే విమర్శలున్నాయి. డీఎంఎఫ్​టీ పేరిట సుమారు రూ.2వేల కోట్లకు పైగా ఫండ్స్​ను రాష్ట్ర ఖజనాకు మళ్లించారని, తద్వారా కంపెనీకి లాభాలు, దాంతోపాటు తమ వాటాలు తగ్గిపోయాయని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. కొంతకాలంగా కంపెనీలో డీజిల్​, ఓబీ కుంభకోణాలు, ఇతరత్రా అవినీతి, అక్రమాలు వెలుగుచూడడంతో కేంద్రం కూడా శ్రీధర్​ పనితీరుపై  తీవ్ర అసంతృప్తితో ఉంది.

ఆత్మగౌరవం ఉంటే రిజైన్​ చేయాలి

ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా  సింగరేణి సీఎండీ పోస్టుకు శ్రీధర్​ రిజైన్​ చేయాలి. సెంట్రల్​ గవర్నమెంట్​వద్దని చెప్పినా కుర్చీని పట్టుకొని కదలట్లేదు. రాబోయే సింగరేణి గుర్తింపుసంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్​ను గెలిపించే కుట్రలో భాగంగానే శ్రీధర్​కు టీఆర్​ఎస్​ సర్కార్​ మళ్లీ ఎక్స్​టెన్షన్​ ఇచ్చింది. శ్రీధర్​ పనితీరు కారణంగానే  సింగరేణి క్రమంగా నష్టాల బాటపడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా శ్రీధర్​ను ఎందుకు కొనసాగిస్తున్నారో సీఎం కేసీఆర్ కే తెలియాలి. -రియాజ్​అహ్మద్, స్టేట్​ ప్రెసిడెంట్, హెచ్​ఎమ్మెస్​ ​

శ్రీధర్​ ఉంటే కేసీఆర్​కు లాభం

సింగరేణి సీఎండీగా శ్రీధర్​ ఉంటే సీఎం కేసీఆర్​కు చాలా లాభం, స్టేట్​ గవర్నమెంట్​ నుంచి రావాల్సిన రూ. వేల కోట్ల బకాయిలను గట్టిగా అడగలేరు. కంపెనీ ఏమైనాన సరే కేసీఆర్​ చెప్పినట్టు తలాడిస్తాడు. అందుకే  శ్రీధర్​ను ఆరేళ్లైనా మరోసారి ఎక్స్​టెన్షన్​ ఇచ్చారు. దీనిని బట్టి సీఎండీకి, సీఎం కేసీఆర్​కు మధ్య ఏదో నడుస్తోందని అర్థం చేసుకోవచ్చు. – వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్​ సెక్రటరీ, సింగరేణి వర్కర్స్​ యూనియన్

కేంద్రం సీరియస్​గా ఉంది

సింగరేణి సీఎండీగా శ్రీధర్​ఎక్స్​టెన్షన్​కు సెంట్రల్​ గవర్నమెంట్​ ఒప్పుకో లేదు. ఇటీవల జరిగిన నేషనల్​ స్టాండింగ్​ కమిటీ సేఫ్టీ మీటింగ్​లోనూ బీఎంఎస్​ లీడర్​ లక్ష్మారెడ్డి వ్యతిరేకించారు. శ్రీధర్​ స్థానంలో సీఎండీగా మరొకరిని నియమించాలని డిమాండ్​ చేశారు. సింగరేణిలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి.  శ్రీధర్​ తీరుతో స్టేట్​ నుంచి రావాల్సిన కోట్ల  బకాయిలు పెండింగ్​పడ్డాయి. స్పెషల్​ రెజ్యులైజేషన్​ను ఆర్డినరీ రెజ్యులైజేషన్​గా మార్చడంపై కేంద్రం సీరియస్​గా ఉంది. -పి.మాధవ్​ నాయక్, స్టేట్​ జనరల్​ సెక్రటరీ, సింగరేణి కోల్​ మైన్స్​ కార్మిక సంఘ్​ (బీఎంఎస్​)