పోలీసులకు నంద కుమార్ భార్య ఫిర్యాదు​

పోలీసులకు నంద కుమార్ భార్య ఫిర్యాదు​

ఖైరతాబాద్, వెలుగు: హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకుండా తమ హోటల్​ను కూల్చి వేశారని.. వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్మేల కొనుగోలు కేసులో నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖ సోమవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె తన కుమారుడు అనీశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. తాము ఫిల్మ్ నగర్​లో దగ్గుబాటి సురేశ్, వెంకటేశ్‌ల నుంచి ల్యాండ్ లీజుకు తీసుకున్నామని, ఆ లీజు 2024 వరకు ఉందన్నారు.  

లీజు ముగియక ముందే మమ్మల్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా రాజకీయ బలంతో తమ హోటల్​ను కూల్చి వేశారన్నారు. నోటీసులు కూడా తమకు అందలేదన్నారు. సరైన సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ అధికారులపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన సమయంలో పోలీసులు తమకు సహకరించలేదని ఆరోపించారు.