టాస్క్​ ద్వారా 4,100 మందికి ఉపాధి ..ఏటా 1.3 లక్షల మంది స్టూడెంట్లకు టెక్నికల్ ​స్కిల్స్​లో శిక్షణ

టాస్క్​ ద్వారా 4,100 మందికి ఉపాధి ..ఏటా 1.3 లక్షల మంది స్టూడెంట్లకు టెక్నికల్ ​స్కిల్స్​లో శిక్షణ
  • మంత్రి శ్రీధర్​ బాబు వెల్లడి
  • ఇంటర్నేషనల్​ సంస్థలు విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయని వ్యాఖ్య 

హైదరాబాద్, వెలుగు: ఏటా 4,100 మందికి ఉపాధి కల్పించేలా టాస్క్​ (తెలంగాణ అకాడమీ ఫర్​ స్కిల్ అండ్​నాలెడ్జ్​).. టెక్నికల్​ ట్రైనింగ్ ఇస్తున్నదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.  ఈ విద్యా సంవత్సరంలో కనీసం 6 వేల మంది నిరుద్యోగులకు టెక్నికల్​ ట్రైనింగ్​ఇప్పించి ఉపాధి కల్పించేలా టార్గెట్​పెట్టుకోవాలని సూచించారు. శుక్రవారం ఆయన టాస్క్​ చేపడుతున్న కార్యక్రమాలపై సెక్రటేరియెట్​లో సమీక్ష నిర్వహించారు.

 నిరుద్యోగులు, విద్యార్థులకు నైపుణ్యాలను అందించడంలో టాస్క్​ పురోగతి సాధించిందన్నారు. ఏడాదిలో రికార్డు స్థాయిలో 1,37,677 మంది విద్యార్థులు, 2791 మంది ఫ్యాకల్టీ సభ్యులకు వివిధ సాంకేతిక, నైపుణ్య అంశాల్లో శిక్షణ అందించిందన్నారు. ‘‘21 జిల్లాల్లోని 148 కాలేజీలు, పలు కంపెనీల ప్రాంగాణాల్లో నిర్వహించిన జాబ్ మేళాల్లో 4100 మంది ఉద్యోగాలు పొందడంలో టాస్క్ కీలక పాత్ర పోషించింది. 

వెరిస్క్ ఎనలిటిక్స్​ అనే అమెరికన్ కంపెనీ హైదరాబాద్ క్యాంపస్ కోసం ఏడాదికి రూ.11 లక్షల ప్యాకేజీతో టెక్నికల్​ఎక్స్​పర్ట్స్​ను ఎంపిక చేసుకున్నది.  హ్యూండాయ్ మోబిస్ సంస్థ టాస్క్ ద్వారా 42 మందికి శిక్షణ అందించి ఉద్యోగాల్లో నియమించుకుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ (యుబిఎస్) రూ.6 లక్షల వార్షిక ప్యాకేజీతో 63 మందిని రిక్రూట్ చేసుకుంది. 1ఎమ్1బీ (వన్ మిలియన్ ఫర్ వన్ బిలియన్) ఫౌండేషన్ తెలంగాణలో ఏర్పాటు చేసిన గ్రీన్ స్కిల్స్ అకాడమీ ద్వారా మేడ్చల్, సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, మంచిర్యాల జిల్లాల నుంచి 7,000 మంది విద్యార్థులు శిక్షణ పొందారు. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన నలుగురు 2024 డిసెంబర్​లో ఐక్యరాజ్య సమితి న్యూయార్క్ లో నిర్వహించిన గ్లోబల్ సదస్సుకు హాజరయ్యారు.

 దివ్యాంగులకు వివిధ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చి ఉద్యోగాలు పొందేలా సాయపడేందుకు టాటా ట్రస్ట్ తో టాస్క్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే మూడేండ్లలో ఎక్స్​ఆర్​ మాంక్​ అనే కంపెనీ ద్వారా 10 వేల మంది విద్యార్థులకు వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, మిక్స్ డ్ రియాలిటీలో శిక్షణ కోసం ఎంఓయూ చేసుకుంది. మొదటి విడతగా 500 మంది ప్రభుత్వ ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ ఏఐ టూల్స్ వినియోగంలో వర్క్ షాప్ నిర్వహించింది’’ అని శ్రీధర్​ బాబు పేర్కొన్నారు.