గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి గురుకుల బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల నియామక పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు అధికారులు. ఈ పరీక్షలన్నీ ఆన్ లైన్ లో నిర్వహిస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ఒకటి రెండు రోజుల్లో వెల్లడించనున్నట్లు కన్వీనర్ మల్లయ్య బట్టు తెలిపారు. 9231 పోస్టులకు మొత్తం 2.63 లక్షల దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే.
పోస్టుల వివరాలు
- ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ) పోస్టులు 4020
- పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్లు(పీజీటీ) 1276
- జూనియర్ లెక్చరర్ ,లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 2008
- డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్ 868
- లైబ్రేరియన్ స్కూల్ 434
- ఫిజికల్ డైరెక్టర్స్ ఇన్ స్కూల్ 275
- మ్యూజిక్ టీచర్లు 124
- క్రాఫ్ట్ ఇన్ స్ట్రక్చర్ ,క్రాఫ్ట్ టీచర్లు 92