ఓ బెల్ట్ షాప్లో కింగ్ ఫిషర్ బీర్లు అమ్ముతున్నారన్న సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రెండు కాటన్ల కింగ్ ఫిషర్ బీర్లు స్వాదీనం చేసుకున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కప్పారావు పేట్ చౌరస్తాలో చోటుచేసుకుంది.
అయితే స్వాధీనం చేసుకున్న బీర్లను తరలించే సమయంలో బెల్ట్ షాప్ యజమాని బంధువులు.. ఎక్సైజ్ పోలీసులను అడ్డుకున్నారు. ఊర్లో మరిన్ని బెల్ట్ షాప్లు ఉన్నాయని.. వాటిని కూడా తనిఖీ చేయాలని వారు పోలీసులను పట్టుబట్టారు. తెలంగాణలో బెల్ట్ షాప్ లులేవా? మీరు కక్షగట్టి ఈ షాప్ తనిఖీ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేత మంత్రి కొప్పుల అనుచరుడైన స్థానిక ఎంపీటీసీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సుమారు గంట తరువాత ఎక్సైజ్ పోలీసులు అక్కడి నుండి కదిలారు.