హెచ్ఎండీఏ ప్రీ బిడ్కు ఫుల్ రెస్పాన్స్..హకీంపేటలో 8 ఎకరాలకు నోటిఫికేషన్.. జులై 2న వేలం

హెచ్ఎండీఏ ప్రీ బిడ్కు ఫుల్ రెస్పాన్స్..హకీంపేటలో 8 ఎకరాలకు నోటిఫికేషన్.. జులై 2న వేలం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ హకీంపేటలో భూముల వేలంపై హెచ్ఎండీఏ నిర్వహించిన ప్రీ బిడ్ మీటింగ్​కు అనూహ్య స్పందన వచ్చింది. శుక్రవారం బంజారాహిల్స్ లోని ఓ హోటల్​లో నిర్వహించిన ఈ మీటింగ్​కు సుమారు 50 మంది ప్రముఖ బిల్డ ర్లు అటెండ్ అయ్యారు. షేక్​పేట మండలం  హకీంపేటలో 8.24 ఎకరాలకు వచ్చే నెల 2న వేలం నిర్వహించనున్నారు. 

ఎకరం రూ.99 కోట్లు కనీస ధరగా అధికారులు నిర్ణయించారు. ఈ సమావేశంలో జేఎల్‌‌‌‌ఎల్ సంస్థకు చెందిన సందీప్ పవర్‌‌‌‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఎంఎస్‌‌‌‌టీసీ సంస్థ మేనేజర్ జమీల్ అక్తర్ ఈ- వేలం ప్రక్రియపై  ప్రజంటేషన్ నిర్వహించి, పాల్గొన్న వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. సమావేశంలో  అధికారులు  పాల్గొన్నారు.