MLC ఓటు నమోదుకు గడువు పెంచాలి: ఈసీకి హైకోర్టు అదేశం

MLC ఓటు నమోదుకు గడువు పెంచాలి: ఈసీకి హైకోర్టు అదేశం

హైదరాబాద్: పట్టభద్రుల ఓటు నమోదుకు నవంబర్-06 చివరి తేదీగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఓటు నమోదు గడువు పెంచాలని శుక్రవారం ఈసీకి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. పట్టభద్రుల ఓటు నమోదు అభ్యంతరాలపై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈసీ వివరణతో ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో జారీ చేసిన ఓటు నమోదు శుక్రవారంతో ముగుస్తుందని హైకోర్టుకు తెలిపింది ఈసీ.

ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. ఈసీ వివరణ నమోదు చేసి పిటిషన్ పై విచారణ ముగించింది హైకోర్టు. దీంతో పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని తెలిపింది ఈసీ. డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు ఓటు హక్కు నమోదుకు అవకాశం కల్పిస్తామని తెలిపింది ఈసీ.