ఫేస్బుక్ డేటా మరోసారి లీకైంది. 26.7 కోట్ల మంది యూజర్ల వివరాలు డార్క్వెబ్లోకి వచ్చాయి. ఇందులో యూజర్ల ఐడీలు, పేర్లు, ఫోన్ నంబర్లు కూడా ఉండడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇందులో ఎక్కువగా అమెరికా యూజర్ల వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాంపారిటెక్, సైబర్సెక్యూరిటీ రీసెర్చర్ బాబ్ డియాచెంకో విడుదల చేసిన రిపోర్టులో ఈ మేరకు వెల్లడైంది. వియత్నాంలోని సైబర్క్రిమినల్స్ఈ పని చేసినట్టు డియాచెంకో తెలిపారు. అయితే డేటాను ఎలా దొంగిలించారనేది క్లియర్గా తెలియనప్పటికీ ‘‘స్ర్కాపింగ్” ద్వారా లేదా ఫేస్బుక్డెవలపర్‘‘ఏపీఐ’’ నుంచి డైరెక్టుగా దోపిడీ చేసి ఉంటారని పేర్కొన్నారు.
యూజర్ల వివరాలు రెండు వారాల పాటు డార్క్వెబ్లో అందుబాటులో ఉన్నాయని, దీనికి సంబంధించిన లింక్ను పాపులర్హ్యాకర్ఫోరమ్లో పోస్ట్చేశారని ఆయన గుర్తించారు. డిసెంబర్4న హ్యాకర్లు డేటాను ఆన్లైన్లో పోస్ట్చేశారు. 12న హ్యాకర్ల ఫోరమ్లో పెట్టారు. దీన్ని అనలిస్టు గుర్తించి ఇంటర్నెట్సర్వీస్ ప్రొవైడర్కు రిపోర్టు పంపగా, ఐపీ అడ్రస్సహాయంతో19న రిమూవ్చేశారు. ఈ డేటాతో సైబర్ క్రిమినల్స్ స్విమ్ స్వాపింగ్, స్వామ్ కాల్స్కు పాల్పడుతారని డియాచెంకో హెచ్చరించారు. ‘‘ఈ సమస్యపై మేం దృష్టిసారించాం. యూజర్ల వివరాలను ప్రొటెక్ట్చేసేందుకు చర్యలు తీసుకున్నాం. హ్యాకర్లు దొంగలించిన డేటా పాతది” అని ఫేస్బుక్ ప్రతినిధి తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్లో 40 కోట్లకు పైగా యూజర్ల ఫోన్ నంబర్లు ఆన్లైన్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.