
- హైదరాబాద్లోనూ
- నకిలీ మందుల తయారీ
- ఆర్ఎంపీలు, ఆన్లైన్ వేదికల ద్వారా అమ్మకాలు
- డీసీఏ తనిఖీల్లో బయటపడిన బాగోతం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నకిలీ మెడిసిన్స్ దందా పెద్ద ఎత్తున జరుగుతోంది. యూపీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల నుంచి ఇక్కడికి పెద్ద మొత్తంలో నకిలీ మందులు ఇంపోర్ట్ అవుతున్నాయి. అక్కడి నుంచి ఇక్కడికి నకిలీ మెడిసిన్స్ తెచ్చుడు కష్టంగా భావిస్తున్న కొంతమంది కేటుగాళ్లు, ఏకంగా ఇక్కడ్నే కంపెనీలు పెట్టి నకిలీ మందులు తయారు చేస్తు న్నారు. ఆర్ఎంపీ డాక్టర్లు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ నకిలీ మందులను రోగులకు అంటగడు తున్నారు. స్టేట్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) డైరె క్టర్ జనరల్గా ఐపీఎస్ అధికారి కమలాసన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నకిలీ మందుల బాగోతంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. 2నెలలుగా ఆర్ఎంపీ క్లినిక్లు, మెడిసిన్ తయారీ కంపెనీలపై దాడులు చేస్తూ నకిలీ మందుల బాగోతాన్ని డీసీఏ బయటపెడుతోంది. గడిచిన నెల రోజుల్లోనే రూ.2 కోట్ల విలువైన నకిలీ మందులను సీజ్ చేశారు. అసలు మందేలేని నకిలీ మెడిసిన్స్ వల్ల రోగం తగ్గకపోగా, కొత్త రోగాలు వచ్చే ప్రమాదం ఉన్నదని డీసీఏ హెచ్చరించింది. మెడిసిన్ కొనుగోలు చేసేటప్పుడు చెక్ చేసుకోవాలని, లైసెన్స్డ్ మెడికల్ షాపుల్లోనే కొనాలని సూచించింది. ఆన్లైన్ోమెడిసిన్స్తో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
మక్కపిండి, సుద్దపొడి
నకిలీ మెడిసిన్ ప్యాకేజీ కోసం బ్రాండెడ్ మెడిసిన్ లోగోలు, పేర్లను కేటుగాళ్లు వినియోగిస్తున్నారు. దాదాపు ఒరిజినల్ ప్రొడక్ట్ మాదిరిగానే ప్యాకేజ్ చేస్తున్నారని, మెడిసిన్ను ల్యాబ్కు పంపించి టెస్ట్ చేస్తే తప్ప కొన్నిసార్లు నకిలీదని గుర్తించలేమని డీసీఏ అధికారులు చెబుతున్నారు. సన్ ఫార్మా, గ్లెన్ మార్క్ ఫార్మా, అరిస్టో ఫార్మాస్యూటికల్స్, టొరెంట్ ఫార్మా వంటి బ్రాండెడ్ కంపెనీల లోగోలు, వివరాలతో నకిలీ మెడిసిన్ను ప్యాక్ చేస్తున్నట్టు తనిఖీల్లో గుర్తించారు. బీపీ, షుగర్ పేషెంట్లు రెగ్యులర్గా వినియోగించే రొసువాస్, టెల్మా, మోనోసెఫ్, చిమోరల్ ఫోర్ట్, అమాగ్జిలిన్ వంటి మందులను సుద్ద, చాక్ పీస్ పౌడర్, మక్క పిండి, ఆలుగడ్డ పిండితో తయారు చేస్తున్నట్టు తేలింది. కేన్సర్, గుండె జబ్బు ట్రీట్మెంట్లో ఉపయోగించే మందులకు కూడా నకిలీలను తయారు చేసి అమ్ముతున్నట్టు గుర్తించారు. గత డిసెంబర్లో మచ్చ బొల్లారంలోని ఓ గోడౌన్లో తనిఖీలు చేసిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు పెద్ద మొత్తంలో నకిలీ క్యాన్సర్ మెడిసిన్స్ సీజ్ చేశారు. క్యాన్సర్, గుండె జబ్బుల్లో ఉపయోగించే మందుల ధరలు ఎక్కువగా ఉంటాయి. పేషెంట్లు ఏండ్ల తరబడి వీటిని వాడాల్సి ఉంటుంది. దీంతో కేటుగాళ్లు వీటికి నకిలీలను తయారు చేసి, తక్కువ ధర ఆశ చూపి పేషెంట్లకు అంటగడుతున్నారు. ఆర్ఎంపీలు, డ్రగ్ కంట్రోల్ అనుమతిలేని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా పేషెంట్లకు వీటిని చేరవేస్తున్నారు. కేటుగాళ్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి కొంత మంది ఆర్ఎంపీలు, అదే పనిగా నకిలీ మందులను అంటగడుతున్నారు. ఇందుకోసం వాట్సప్ గ్రూపులను వేదికలుగా చేసుకుంటున్నారు.
హైదరాబాద్లోనే నకిలీ కంపెనీలు
హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న పారిశ్రామి క వాడల్లోనూ నకిలీ మందుల తయారీ విపరీతంగా జరుగుతోంది. రామ్స్ ఫార్మాస్యూటికల్స్ పేరిట మూసాపేట్లో నకిలీ యాంటీ అల్సర్ మందులను తయారు చేస్తున్న ఓ కంపెనీ గుట్టును గత నెల 30న డీసీఏ బయటపెట్టింది. బయోమెడికల్ ఫా ర్మాస్యూటికల్స్ పేరిట వీటిని రాష్ట్రవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇదే కంపెనీకి చెందిన ఓ గోడౌన్ను నిజామాబాద్లో అధికారులు గుర్తించి తనిఖీ చేయగా.. అక్కడ ఏ కంగా 30 వేల నకిలీ ట్యాబ్లెట్లు దొరికాయి. గత నెల ఐదో తేదీన మచ్చ బొల్లారంలో నకిలీ యాంటీ కేన్సర్ మందులను తయారు చేస్తున్న ఓ కంపెనీని డీసీఏ అధికారులు సీజ్ చేశారు. ఇక్కడ ఏకంగా పది కంపెనీల పేర్లతో నకిలీ మెడిసిన్స్ ప్యాక్ చేస్తున్నట్టు గుర్తించారు.
ఆర్ఎంపీలే సేల్స్మెన్
ఆపద సమయంలో ప్రజలకు ప్రాథమిక వైద్య సా యం అందించాల్సిన కొంత మంది ఆర్ఎంపీలు.. నకిలీ మందులు అంటగట్టి పేషెంట్ల ప్రాణాల మీదకు తీసుకొస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీల పేరిట తయారు చేసిన నకిలీ మందులను తయారీదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిని పేషెంట్లకు అమ్ముతున్నారు. ఇటీవల డీసీఏ జరిపిన దాడుల్లో కొంత మంది ఆర్ఎంపీల వద్ద పెద్ద మొత్తంలో హైడోస్ యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ మందులను సీజ్ చేశారు. ఆర్ఎంపీలు మెడిసిన్స్ అమ్మేందుకు పర్మిషన్ లేదు. కానీ, నకి లీ మందులు అమ్మడం ద్వారా పెద్ద మొత్తంలో కమీషన్ వస్తుండడంతో కుప్పలు తెప్పలుగా వాటిని పేషెంట్లకు అంటగడుతున్నారు. ఓ రకంగా నకిలీ కంపెనీలకు, ఆర్ఎంపీలు సేల్స్మెన్గా తయారయ్యారని డీసీఏ అధికారులు చెబుతున్నారు.