బీజేపీ తీర్థం పుచ్చుకున్న యాక్టర్ సంజయ్

బీజేపీ తీర్థం పుచ్చుకున్న యాక్టర్ సంజయ్

హైదరాబాద్, వెలుగు: ప్రముఖ సీని నటుడు సంజయ్ రాయచుర బీజేపీలో చేరారు. హుజూరాబాద్‌‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆయనకు కండువా కప్పి శనివారం పార్టీలోకి ఆహ్వానించారు. ఆచార్య, మహర్షి సహా పలు తెలుగు, దక్షిణాది సినిమాలు, టీవీ సీరియళ్లలో సంజయ్ నటించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ విజన్, సమర్థవంతమైన నాయకత్వానికి ఆకర్షితుడినై బీజేపీలో చేరుతున్నానని చెప్పారు.

సంజయ్ చేరికతో బీజేపీ మరింత బలోపేతమవుతుందని ఈటల అన్నారు. ఇతర పార్టీల నుంచి చాలా మంది నాయకులు తమ పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నానని కార్యక్రమంలో కర్నాటక మాజీ సీఎస్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రత్నప్రభ పాల్గొన్నారు.