పొలంలో  వేలాడుతున్న కరెంటు తీగలు తగిలి రైతు మృతి

పొలంలో  వేలాడుతున్న కరెంటు తీగలు తగిలి రైతు మృతి

కర్నూలు: పొలంలో తక్కువ ఎత్తులో వేలాడుతున్న కరెంటు తీగలు తగిలి చెన్నయ్య (35) రైతు మృతి చెందిన సంఘటన జూపాడుబంగ్లా మండలం మండ్లెం గ్రామంలో జరిగింది. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాను కౌలుకు తీసుకున్న పొలంలో మొక్కజొన్న పంట నూర్పిడి కోసం నూర్పిడి యంత్రాన్ని తీసుకుని వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. రోడ్డు పక్కన పొలంలోకి వెళ్లేటప్పుడు తక్కువ ఎత్తులో వేలాడుతున్న కరెంటు తీగలను తప్పిస్తుండగా కరెంట్ షాక్ కొట్టింది. కేకలు వేస్తూ పడిపోవడంతో స్థానికులు గుర్తించి హుటా హుటిన ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే తీవ్రంగా గాయపడిన చెన్నయ్య విలవిలలాడుతూ కన్నుమూశాడు. విషయం తెలిసిన వెంటనే చెన్నయ్య తండ్రి తిరుపతయ్య.. భార్య పిల్లలు బోరున విలపించడం కంట తడిపెట్టించింది.