అప్పుల బాధతో రైతు సూసైడ్

అప్పుల బాధతో రైతు సూసైడ్

గూడూరు, వెలుగు: అప్పుల బాధతో మండలంలోని రాజన్ పల్లికి చెందిన ధారావత్ రాములు(52) పాయిజన్ తాగి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం..గ్రామంలో తనకున్న రెండు ఎకరాల పొలంలో వ్యవసాయం చేయగా దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చింది. దీంతో
రూ.2లక్షల వరకు అప్పులయ్యాయి. దీనికి తోడు తన నాలుగో కూతురు పెండ్లి ఈడుకు రావడంతో మరోసారి అప్పులు చేయాల్సి వస్తుందని మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఆదివారం ఇంట్లో పాయిజన్ తాగి సూసైడ్ చేసు కున్నాడు.