అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ఇల్లెందు, వెలుగు: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణం సత్యనారాయణపురానికి చెందిన జాల కన్నయ్య(65)  ఏడేండ్లు మావోయిస్టు పార్టీలో పనిచేశాడు. ఉమ్మడి రాష్ర్టంలో సీఎం కిరణ్​కుమార్​రెడ్డి హయాంలో  పోలీసులకు లొంగిపోయాడు. పునరావాసం కింద వచ్చిన భూమి కబ్జాకు గురవ్వడంతో సత్యనారాయణపురంలో పోడు వ్యవసాయం చేసుకుంటూ  జీవిస్తున్నాడు. తనకున్న ఐదెకరాలలో మక్కలు సాగు చేస్తున్నాడు. పంట పెట్టుబడికి రూ. 4 లక్షల వరకు అప్పయ్యింది. ఈ ఏడాది కూడా భారీ వర్షాలు, కోతుల బెడదతో పంట దెబ్బతింది. దీంతో సోమవారం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం కన్నయ్య మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు.