వడ్ల పైసలు రాలేదని దున్నపోతుకు వినతిపత్రం

వడ్ల పైసలు రాలేదని దున్నపోతుకు వినతిపత్రం

ధర్మపురి, వెలుగు: వడ్లు తూకం వేసి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా అకౌంట్ లో డబ్బులు పడలేదని ఓ రైతు వినూత్న నిరసన తెలిపాడు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కోసునూరుపల్లె గ్రామానికి చెందిన విక్రమ్ రెడ్డి అనే రైతు రెండు నెలల క్రితం తీగల ధర్మారం సెంట్​లో 30 బస్తాల వడ్లు అమ్మాడు. కొన్ని రోజుల తర్వాత రోజూ బ్యాంకుకు వెళ్లి కనుక్కుంటున్నా అకౌంట్​లో మాత్రం డబ్బులు పడలేదు. దీంతో విసిగిపోయి సర్కారు తీరుకు నిరసనగా గురువారం దున్నపోతుకు వినతిపత్రం అందజేశాడు. ఇప్పటికైనా ఆఫీసర్లు డబ్బులు వచ్చేలా చూడాలని కోరాడు. గ్రామంలో ఇంకా 25 మందికి డబ్బులు రావాల్సి ఉంది.