ఎమ్మార్వో ఆఫీస్ వద్ద పెట్రోల్​ పోసుకున్న రైతు

ఎమ్మార్వో ఆఫీస్ వద్ద పెట్రోల్​ పోసుకున్న రైతు

పట్టా భూమిని ఇనాం భూమిగా మార్చారని ఆవేదన

మానవపాడు (జోగులాంబ గద్వాల), వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు తహసీల్దార్ కార్యాలయంలోకి పెట్రోల్ బాటిల్ తీసుకుని వెళ్లిన ఓ రైతు అక్కడే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. భూమి సమస్య పరిష్కరించాలని ఏడాదిగా అధికారులు చుట్టూ తిరుగుతున్నా.. పట్టించుకోకపోవడంతో విసిగిపోయిన నారాయణపురం గ్రామానికి చెందిన రైతుపల్లి రాజశేఖర్ రెడ్డి అనే రైతు  చివరికి తహసీల్దార్ కార్యాలయంలోనే పెట్రోల్ పోసుకున్నాడు. అక్కడే ఉన్న ఎస్ఐ గురుస్వామి, పోలీస్​ సిబ్బంది గమనించి అడ్డుకున్నారు. ఉన్నతాధికారులకు తెలిపామని, ఓఆర్సీ వచ్చి వెంటనే పరిష్కరిస్తామని తహసీల్దార్ వరలక్ష్మి హామీ ఇవ్వడంతో విరమించుకున్నాడు. తన మూడెకరాలు పట్టా భూమిని సమగ్ర సర్వేలో ఇనాం భూమిగా మార్చి పాస్ పుస్తకం రాకుండా చేశారని, సమస్యను పరిష్కరించాలని రాజశేఖర్ అధికారులను కోరారు.