
తన భూమిని సాగు చేసుకోకుండా ఇబ్బందిపెడ్తున్న సీఐ, ఎస్సైపై చర్యలు తీసుకోవాలంటూ ఓ రైతు పొలంలో సత్యాగ్రహ దీక్షకు దిగాడు. భూపాలపల్లి జిల్లా చింతకుంట రామయ్యపల్లికి చెందిన సుధాకర్రావు, మోహన్రావు మధ్య 9 గుంటల భూమిపై తగాదా నడుస్తోంది. ఇది పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా.. వారు కోర్టు కేసు ఉన్న భూమితో పాటు తన ఎకరం పొలాన్ని కూడా సాగు చేయనీయట్లేదని, తప్పుడు కేసులు పెట్టారని సుధాకర్రావు పేర్కొంటున్నారు. అయితే చట్ట ప్రకారం ఇరుపక్షాలపై కేసులు పెట్టామని పోలీసులు చెప్తున్నారు. – భూపాలపల్లి, వెలుగు
For More News..