రైతువేదిక భవనం కోసం బలవంతంగా భూసేకరణ.. రైతు ఆత్మహత్య

రైతువేదిక భవనం కోసం బలవంతంగా భూసేకరణ.. రైతు ఆత్మహత్య

సిద్దిపేట జిల్లా, వర్గల్ మండలం వేలూరుకు చెందిన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన బ్యాగరి నర్సింహులు అనే రైతుకు చెందిన 13 గుంటల భూమిని.. రైతు వేదిక భవనానికి ఇవ్వాలని రెవెన్యూ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఆ కారణంతో భూమిని రికార్డుల్లో కూడా ఎక్కించలేదు. దాంతో మనస్థాపం చెందిన నర్సింహులు బుధవారం పొలం దగ్గరికెళ్లి పురుగుల మందు తాగాడు. గమనించిన చుట్టుపక్కల వాళ్లు వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన తర్వాత మెరుగైన వైద్యం కోసం సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నర్సింహులు గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. భూమిని రైతు వేదిక భవనానికి ఇవ్వాలని రెవెన్యూ అధికారుల ఒత్తిడి వల్లే నర్సింహులు చనిపోయాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

బ్యాగరి నర్సింహులు మృతిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్పీ కులానికి చెందిన నర్సింహులు మృతికి కారణమైన వారిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దళితులపై దాడులు చేయిస్తూ వారి మరణానికి కారణమవుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

For More News..

ప్రభుత్వానికి అంబులెన్సులను అందజేసిన కేటీఆర్

అడ్డుకుంటున్నాడని లారీతో తొక్కించిన ఇసుక మాఫియా

అన్నా.. రాఖీ పంపుతున్నా.. నేను రావట్లే..