ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో హైవే పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డుపై రైతులు మక్కలు ఆరబెడుతున్నారు. మాదాపురం, లోక్యతండా, కొక్య తండాకు చెందిన రైతులకు కల్లాల్లో మక్కలు అరబెట్టుకునే స్థలం లేకపోవడంతో ఇలా సర్వీస్ రోడ్డుపై మక్కలు పోశారు. ఇలా ఒక్కో రైతు మూడు రోజులు మక్కలను రోడ్డుపైనే ఉంచుతున్నారు. రోడ్డుపై మక్కలు ఆరబెట్టడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డుపై కనుచూపు మేర కనిపించిన మక్కలు ఆరబోసిన దృశ్యాన్ని వెలుగు కెమెరాలో బంధించింది.
- వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం
