తెలంగాణలో రైతాంగం మొత్తం రోడ్డు మీదే

తెలంగాణలో రైతాంగం మొత్తం రోడ్డు మీదే

తెలంగాణలో రైతాంగం మొత్తం రోడ్డుమీదే ఉందన్నారు ఎంపీ నామా నాగేశ్వరరావు. వరి కొనుగోళ్లపై కేంద్రం పూటకో మాట చెబుతోందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలన్నారు. కేంద్రం ఎంత కొంటుందో క్లారిటీ ఇస్తే.. అదే తెలంగాణ రైతాంగానికి చెబుతామన్నారు. లోక్ సభలో వరికొనుగోళ్లపై కేంద్రాన్ని నిలదీశారు నామా.