జైహింద్​పూర్​లో మూడు రోజులుగా పోడు భూముల్లోనే రైతులు

జైహింద్​పూర్​లో మూడు రోజులుగా పోడు భూముల్లోనే రైతులు

కాగజ్ నగర్, వెలుగు: పోడు భూములను కాపాడుకునేందుకు రైతులు గోస పడుతున్నారు. పెంచికల్​పేట్ మండలం జైహింద్​పూర్​లో గత మూడు రోజులుగా పోడు భూమిలోనే ఉంటూ అక్కడ మొక్కలు నాటకుండా చూస్తున్నారు. గత 15 రోజులుగా పోడు భూముల రీట్రైవ్ కోసం ఫారెస్ట్ ఆఫీసర్లు ప్రయత్నం చేస్తుండగా రైతులు అడ్డుకుంటున్నారు. అయితే ఆ రైతులు నాన్ ట్రైబల్స్ కావడంతో ఫారెస్ట్ ఆఫీసర్లు ఈ భూములు స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. 

దీంతో అధికారులు ఎప్పుడైనా వచ్చి ట్రెంచ్ కొట్టడం, మొక్కలు నాటేందుకు చదును చేసే అవకాశం ఉందని రాత్రి కూడా ఆ పోడు భూముల్లోనే నిద్రిస్తున్నారు. దశాబ్దాలుగా సాగు చేస్తున్న ఆ భూములు వదులుకోమని రైతులు వెల్లడిస్తున్నారు.