పట్టా చేయడం లేదని వాటర్ ట్యాంక్ ఎక్కిన రైతులు

పట్టా చేయడం లేదని  వాటర్ ట్యాంక్ ఎక్కిన రైతులు

నెల్లికుదురు(కేసముద్రం),వెలుగు: మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ రైతులు తమ వ్యవసాయ భూములకు పట్టా చేయడం లేదని శుక్రవారం వాటర్ ట్యాంక్ ఎక్కారు. జనవరిలో ఫారెస్టు డిపార్ట్​మెంట్ ​క్లియరెన్స్ ఇచ్చినా ఎంజాయ్​మెంట్​సర్వే చేయడం లేదని ఆరోపించారు. గతంలో సాదా బైనామాలో దరఖాస్తు చేసుకున్నవాళ్లకు ఎంజాయ్ మెంట్ సర్వే ప్రకారం పట్టాదారు పాస్​బుక్స్​ ఇవ్వాలని, సర్వేయర్​ను స్పాట్ కు పంపి సమస్య పరిష్కరించాలని, గతంలో చేసిన ఎంజాయ్ మెంట్ లిస్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు. తర్వాత తహసీల్దార్​ఆఫీసు ముందు బైఠాయించారు.