
- తండ్రి మృతి, కొడుకు సీరియస్
ఆత్మకూరు, వెలుగు: భూ తగాదాలో తండ్రీకొడుకులు పాయిజన్ తాగిన సంఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలకేంద్రంలో జరిగింది. ఆత్మకూరు గ్రామానికి చెందిన అడప సాంబయ్య(65), కక్కెర్ల వెంకటయ్య ఇద్దరు మిత్రులు. ఇరువురు సుమారు 15 ఏండ్ల కింద గూడెప్పాడ్ గ్రామంలో ఎకరం భూమిని కొనుగోలు చేశారు. సాంబయ్య తన 20 గుంటల భూమిని ఎనిమిదేండ్ల కింద అమ్ముకున్నాడు. అయితే తనకు ఇంకా రెండు గుంటల భూమి వస్తుందని తరచూ వెంకటయ్యతో గొడవ పడేవాడు. భూవివాదాలు మనసులో పెట్టుకుని సోమవారం గూడెప్పడ్ గ్రామంలో సాంబయ్య పాయిజన్ తాగి, దివ్యాంగుడైన అతని కొడుకు కృష్ణకు కూడా తాగించారు. స్థానికులు గమనించి 108కి ఫోన్ చేశారు. అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో తండ్రి సాంబయ్య చనిపోయాడు. కొడుకు కృష్ణ పరిస్థితి సీరియస్ గా ఉంది.