కొడుకుకు వచ్చిన ఉత్తరం చదివినందుకు తండ్రికి జైలు

కొడుకుకు వచ్చిన ఉత్తరం చదివినందుకు తండ్రికి జైలు

కొడుకుకు వచ్చిన ఉత్తరం చదివినందుకు రెండేళ్లు జైలు పాలయ్యాడు ఓతండ్రి. ఈ ఘటన స్పెయిల్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే… ఆ పిల్లాడి తండ్రి, తల్లి గొడవపడి కొంతకాలంగా విడిగా ఉంటున్నారు.  ఆ పిల్లాడు మాత్రం తండ్రి దగ్గరే ఉన్నాడు. దీంతో ఆ పిల్లాడికి అతని తల్లి ఉత్తరం రాసింది. అందులో అతని తండ్రి ఆమెను ఎంతగా వేధించాడో తెలిపింది. అయితే ఆ ఉత్తరం భర్త చదివాడు. దీంతో.. తన భార్య తనపై గృహ హింసకేసు పెట్టి తనను బెదిరించాలని చూస్తుందని కోర్టుకు వెళ్లాడు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. కొడుకుకు వచ్చిన ఉత్తరాన్ని చదివినందుకు అదే కోర్టు తండ్రికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కొడుకు అనుమతి లేకుంగా ఉత్తరం చదవటం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించినందుకు శిక్ష విధించినట్లు కోర్టు తెలిపింది.