గ్లాసు పాల కోసం కన్న కొడుకును చంపిన తండ్రి

గ్లాసు పాల కోసం కన్న కొడుకును చంపిన తండ్రి

లక్నో: గ్లాసు పాల విషయంలో జరిగిన వివాదంలో టీనేజ్ కొడుకును చంపాడో తండ్రి. ఆ తర్వాత తాను కూడా కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ దారుణం ఉత్తర్ ప్రదేశ్ లోని పురాణాపూర్ ఏరియాలో సోమవారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు గురువారం మీడియాకు వెల్లడించారు. గ్లాసులో పాలు తక్కువగా ఇచ్చాడన్న కోపంతో గురుముఖ్ సింగ్ తన 16 ఏళ్ల కొడుకు జస్కరన్ సింగ్ తో వాగ్వాదం పెట్టుకున్నాడని, తనకిచ్చిన పాల కన్నా జస్కర్ సింగ్ ఎక్కువగా తాగాడంటూ ఫైర్ అయ్యాడని చెప్పారు. ‘‘అతన్ని ఆపేందుకు ప్రయత్నించిన సోదరుడు అవతార్ సింగ్​ను, కొడుకును.. గురుముఖ్ సింగ్ పిస్తోల్​తో కాల్చాడు. ఆ తర్వాత తాను కూడా కాల్చుకున్నాడు. స్పాట్​లోనే గురుముఖ్, అతని కొడుకు చనిపోగా.. అవతార్ ని ఆస్పత్రికి తరలించాం”అని పోలీసులు చెప్పారు. అవతార్ కండిషన్  స్థిరంగా ఉందన్నారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.