
ముత్తారం, వెలుగు: ముత్తారం మండలకేంద్రంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గురువారం పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈఈ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ రైతులు నాణ్యమైన కరెంట్ కోసం ఐఎస్ ఐ ఉన్న కెపాసిటర్లు, మోటర్లను వాడాలన్నారు. వర్షాకాలంలో ట్రాన్స్ ఫార్మర్ల వద్ద, స్టాటర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్య వస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.