యాదాద్రి భువనగిరి జిల్లాలో కోతుల గుంపు హల్ చల్ చేసింది. మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో అడవి నుంచి గుంపులు గుంపులుగా వచ్చిన కోతులతో...గ్రామానికి చెందిన కోతులు గొడవ పడ్డాయి. సుమారు రెండు గంటల పాటు దాడులు చేసుకుంటూ రచ్చ రచ్చ చేశాయి.
అయితే.. ఎంతకు కోతుల గొడవ సద్దుమణిగేలా కనిపించకపోవడంతో గ్రామస్తులు వాటిని కర్రలతో బెదిరించడంతో పారిపోయాయి.
కోతుల గొడవ దృశ్యాలను గ్రామంలోని యువకులు తమసెల్ ఫోన్లలో రికార్డు చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో వీడియోలు వైరల్ గా మారాయి.
సరిహద్దు గొడవలు మనుషుల్లోనే కాదు.. కోతుల్లో కూడా ఉంటాయని, వాటి గొడవను చూసిన గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.