టిక్ టాక్ పిచ్చి: ఫ్రెండ్ ను చంపేశాడు

టిక్ టాక్ పిచ్చి: ఫ్రెండ్ ను చంపేశాడు

సరదా ఆనందాన్నిచ్చేదిగా ఉండాలి కాని ప్రాణాలుతీసేదిగా కాదు. అయితే ఇదివరకు సెల్పీల పిచ్చిలో పలువురు ప్రణాలు కోల్పోగా ఇప్పుడు టిక్ టాక్ వంతైంది. ఇందులో భాగంగా.. టిక్ టాక్ వీడియో తీయబోయి స్నేహితుడిని గన్ తో కాల్చి ప్రాణాలు తీశాడు ఒకతను.  పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఢిల్లీలో నివాసం ఉంటున్న సోహెల్, ఆమిర్ అనే ఇద్దరు దగ్గరి బందువులు. నిన్న రాత్రి వీరిద్దరు మరో స్నేహితుడు సల్మాన్ తో కలిసి.. ఇండియా గేట్ దగ్గరికి కారులో సరదాగా శికారుకి వెళ్లారు. అయితే రిటన్ అవుతున్న క్రమంలో సోహెల్ టిక్ టాక్ వీడియో తీయాలని అనుకున్నడు… అప్పుడు కార్ ను సల్మాన్ నడునుతున్నాడు. సోహెల్ తన దగ్గర ఉన్న గన్ ను తీసుకుని సల్మాన్ తలకు గురి పెట్టాడు. దీంతో ఒక్కసారిగా గన్ పేలింది. బులెట్ సల్మాన్ దవడ నుంచి దూసుకు పోయింది. దీంతో భారీగా రక్తప్రావం అయింది.

ఊహించని ఘటన జరగడంతో.. సోహెల్ షాక్ కు గురయ్యాడు. అయితే వెంటనే సల్మాన్ ను హాస్పిటల్ కు తీసుకెళ్లకుండా ధర్యాగంజ్ లో ఉన్న వారి రిలేటీవ్స్ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ సల్మాన్ రక్తపు బట్టలను మార్చి హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అప్పటికే సల్మాన్ చనిపోయిట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. రాత్రి 11.30 నిమిషాలకు వచ్చి కేసును నమోదు చేసుకున్నారు.

సల్మాన్ ను కావాలని చంపలేదని తెలిపాడు సోహోల్. టిక్ టాక్ వీడియో తీసే క్రమంలో గన్ మిస్ ఫైర్ అయిందని చెప్పాడు. కారు ఒక్క సారిగా కుదుపులకు గురయ్యిందని అప్పటికే తన చేతిలో ఉన్న గన్ సల్మాన్ తల దగ్గర ఉండటంతో ఫైర్ అయిందని చెప్పారు. సోహెల్ తో పాటు సల్మాన్ బట్టలను మార్చిన బందువును కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.

సల్మాన్ మరణవార్త తెలిసిన వెంటనే హాస్పిటల్ కు చేరుకున్నారు అతని ఫ్యామిలీ మెంబర్స్. ఇంట్లో హాయిగా గడిపుతున్న తమ కొడుకును తీసుకెళ్లి చంపేశాడని బోరున ఏడ్చారు. యువత పెడదోవ పడుతున్న పలు గేమ్ లను బ్యాన్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.