హిందీలో బాగా పాపులర్ అయిన టీవీ షో.. ‘ది కపిల్ శర్మ షో’పై పోలీసు కేసు నమోదైంది. కమిడియన్ కపిల్ శర్మ హోస్ట్గా నడిచే ఈ ఎంటర్టైన్మెంట్ షో నిర్వాహకులపై మధ్యప్రదేశ్కు చెందిన శివ్పురిలో కోర్టులో ఓ లాయర్ పిటిషన్ వేశారు. ఈ షోలో వేసిన కోర్టు రూమ్ సెట్లో నటించిన ఆర్టిస్టులు ఆల్కహాల్ తాగారని, ఇది కోర్టులను అవమానించడమేనంటూ కంప్లైంట్ చేశారు. కోర్టును అగౌరవపరిచేలా షోను టెలికాస్ట్ చేసిన నిర్వాహకులపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరారు.
వాస్తవానికి లాయర్ కంప్లైంట్ చేసిన ఆ ఎపిసోడ్ 2020 జనవరి 19న సోనీ టీవీలో టెలికాస్ట్ అయింది. ఆ తర్వాత మళ్లీ 2021 ఏప్రిల్ 24న రీటెలికాస్ట్ అయింది. అందులో కోర్టులను అవమానించేలా ఆ సీన్లో మద్యం తాగడమే కాకుండా, మహిళలపైనా అసభ్యకరమైన వ్యాఖ్యలు ఉన్నాయని లాయర్ పేర్కొన్నారు. ఇటువంటి సీన్లు ప్రజల్లోకి వెళ్లడం ద్వారా కోర్టుల గౌరవం పలుచన అవుతుందని, సెక్షన్ 356/3 కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి, ఇందులో భాగమైన అందరినీ శిక్షించాలని కోర్టును కోరానని తెలిపారు. ఈ కేసును శివ్పురి జిల్లా కోర్టు అక్టోబర్ 1న విచారించనుందని చెప్పారు.
మరిన్ని వార్తల కోసం..
పేరుకే మినరల్ వాటర్ ప్లాంట్స్.. కానీ అంతా కెమికల్!
తప్పు చేస్తే కాళ్లు, చేతులు నరికేస్తాం
అయ్యయ్యో వద్దమ్మా.. అలాంటి లింక్స్ ఓపెన్ చేయొద్దు