సంజయ్​ రౌత్​పై దేశద్రోహం కేసు

సంజయ్​ రౌత్​పై దేశద్రోహం కేసు

న్యూఢిల్లీ: శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ లో ప్రధాని మోదీపై అభ్యంతరకర ఆర్టికల్​వేసినందుకు ఆ పత్రిక ఎగ్జిక్యూటివ్​ ఎడిటర్, రాజ్యసభ సభ్యుడు సంజయ్ ​రౌత్​పై దేశద్రోహం కేసు నమోదైంది. ప్రధాని మోదీపై అభ్యంతరకర ఆర్టికల్ ​పబ్లిష్​  చేశారని ఆరోపిస్తూ.. సంజయ్​ రౌత్​పై మహారాష్ట్రలోని యావత్మాల్​ జిల్లా సమన్వయకర్తగా ఉన్న నితిన్​భుతాడా అనే వ్యక్తి డిసెంబర్10న ఉమర్​ఖేడ్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు సోమవారం రౌత్​పై దేశద్రోహం సహా ఇతర నేరాలకు సంబంధించిన పలు సెక్షన్లపై కేసు నమోదు చేసిన పోలీస్​ అధికారులు.. మంగళవారం వివరాలు వెల్లడించారు. రాజకీయ విమర్శలను కూడా ‘సెన్సార్షిప్’ చేసే బీజేపీకి.. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేశామని చెప్పుకునే హక్కు లేదని విమర్శించారు.