న్యూఢిల్లీ: శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ లో ప్రధాని మోదీపై అభ్యంతరకర ఆర్టికల్వేసినందుకు ఆ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్పై దేశద్రోహం కేసు నమోదైంది. ప్రధాని మోదీపై అభ్యంతరకర ఆర్టికల్ పబ్లిష్ చేశారని ఆరోపిస్తూ.. సంజయ్ రౌత్పై మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా సమన్వయకర్తగా ఉన్న నితిన్భుతాడా అనే వ్యక్తి డిసెంబర్10న ఉమర్ఖేడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు సోమవారం రౌత్పై దేశద్రోహం సహా ఇతర నేరాలకు సంబంధించిన పలు సెక్షన్లపై కేసు నమోదు చేసిన పోలీస్ అధికారులు.. మంగళవారం వివరాలు వెల్లడించారు. రాజకీయ విమర్శలను కూడా ‘సెన్సార్షిప్’ చేసే బీజేపీకి.. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేశామని చెప్పుకునే హక్కు లేదని విమర్శించారు.