స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం..

 స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం..

హైదరాబాద్ కూకట్ పల్లిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కేపిహెచ్ బీ కాలనీ 3వ ఫేజ్ లోని రమ్యా గ్రౌండ్ వద్ద ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ఇండ్లలో ఉన్న జనాలు భయాందోళనలకు గురైయ్యారు. మంటల్లో స్క్రాప్ దుకాణం పూర్తిగా దగ్ధమైంది.

వెంటనే స్థానికులు అందించిన సమాచారంతో ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ తో మంటలను అదుపు చేశారు సిబ్బంది. షార్ట్ సర్క్యూట్ వల్లనే మంటలు చెలరేగాయని అనుమానం వ్యక్తం చేశాడు షాపు యజమాని. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్త చేస్తున్నారు.