ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఆరు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెస్తున్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
‘ఎఫ్ బ్లాక్లోని ఓ హోటల్లో అగ్నిప్రమాదం గురించి ఉదయం 8:53 గంటలకు మాకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి ప్రాథమికంగా ఆరు ఫైర్ ఇంజన్లు పంపించాం. ఇప్పటివరకు మాకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు రాలేదు ”అని అగ్నిమాపక దళ అధికారి తెలిపారు.