తెలంగాణ ఎక్స్ప్రెస్లో మంటలు..పరుగులు తీసిన ప్రయాణికులు

తెలంగాణ ఎక్స్ప్రెస్లో మంటలు..పరుగులు తీసిన ప్రయాణికులు

ఉదయం బెంగుళూరులో ఉద్యాన్ ఎక్స్ ప్రెస్ మంటల్లో చిక్కుకున్న ఘటన మరవక ముందే మరో రైలు ప్రమాదానికి గురైంది. ఆగస్టు 19వ తేదీన ఉదయం మహారాష్ట్రలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని నాగపూర్ సమీపంలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎస్-2 బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఆగస్టు 18వ తేదీ ఢిల్లీ నుంచి బయలుదేరిన తెలంగాణ ఎక్స్ ప్రెస్..మహారాష్ట్రలోని నాగ్ పూర్ లోకి రాగానే ఆగస్టు 19వ తేదీ తెల్లవారుజామున ఎస్ 2 బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికుల నుండి సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ట్రైన్‌ను నాగ్‌పూర్ సమీపంలోనే  నిలిపివేశారు.  హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక  బృందాలు  బోగీలోని మంటలను అదుపులోకి తెచ్చారు. 

ఎస్ 2 కోచ్ లో అకస్మాత్తుగా  పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైలు ఆగిన వెంటనే భయంతో పరుగులు తీశారు. అయితే  ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో  అంతా ఊపీరి పీల్చుకున్నారు.