
కోచి: కొలంబో నుంచి ముంబైకు వెళుతున్న సింగపూర్ కంటైనర్ షిప్ ఎంవీ వాన్ హై 503లో పేలుడు సంభవించి మంటలు అంటుకున్నాయి. సోమవారం (జూన్ 9) ఉదయం 10.30 గంటలకు కేరళలోని కోజికోడ్ లో బేపోర్ తీరంలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగినపుడు ఓడలో 22 మంది సిబ్బంది ఉన్నారు. షిప్ డెక్ కింద పేలుడు సంభవించి అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఇండియన్ నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
షిప్ లో ఉన్న 18 మందిని కాపాడారు. మరో నలుగురు గల్లంతయినట్లు అనుమానిస్తున్నారు. వారిలో ఇద్దరు తైవాన్ జాతీయులు కాగా.. ఒకరు మయన్మార్, మరొకరు ఇండోనేషియన్ ఉన్నారు.