రెండు గంటలే పటాకులు కాల్చాలె: పోలీసుల ఉత్తుర్వులు

రెండు గంటలే పటాకులు కాల్చాలె: పోలీసుల ఉత్తుర్వులు

రాచకొండ: దీపావళి వేళ రాచకొండ పోలీసులు కీలక సూచనలు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో పటాకులు కాల్చడంపై నిషేధం విదించారు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే  పటాకులు కాల్చేందుకు అనుమతినిచ్చారు. ఈ ఆంక్షలు నవంబర్ 12 నుంచి 15 వరకు అమలులో ఉంటాయని తెలిపారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ ఉత్తర్వులను జారీ చేశారు.