
- శాస్త్రీయం కాదని తెలిసినా కొనసాగించడం కరెక్ట్ కాదు..
ముషీరాబాద్, వెలుగు: చేప ప్రసాదం శాస్త్రీయంగా ఆస్తమాను తగ్గించదని పరీక్షల్లో తేలినప్పటికీ దానిని కొనసాగించడం సరికాదని జన విజ్ఞాన వేదిక అభిప్రాయపడింది. చేప ప్రసాదంతో ఆస్తమా రోగులకు ప్రయోజనం కాకపోగా, కొత్త రోగాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. శుక్రవారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో వేదిక తెలంగాణ సైన్స్ కమ్యూనికేషన్ సబ్ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య, రాజా మాట్లాడారు.
చేప ప్రసాదం కేవలం మూఢ విశ్వాసం మాత్రమేనని, ఎలాంటి వైద్యం ప్రామాణికత లేదన్నారు. అయినప్పటికీ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించే చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం సహకరించడం ఏమాత్రం సరికాదన్నారు. ప్రతి జిల్లాలో ఆస్తమా రోగుల కోసం వైద్యులను, మందులను ప్రభుత్వం సమకూర్చాలని డిమాండ్ చేశారు. జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు రజిని, లింగస్వామి పాల్గొన్నారు.