సికింద్రాబాద్ కిడ్నాప్ కేసులో ఐదుగురు రౌడీషీటర్ల అరెస్ట్

సికింద్రాబాద్ కిడ్నాప్ కేసులో ఐదుగురు రౌడీషీటర్ల అరెస్ట్

సికింద్రాబాద్ మారేడ్ పల్లిలో ఓ కిడ్నాప్ కేసులో ఐదుగురు రౌడీషీటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఓ కేసు విషయమై రాజీ కావాలని వ్యక్తిని కిడ్నాప్ చేసి.. అతన్ని కొట్టారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో కృష్ణ యాదవ్(గొల్ల కిట్టు)తో పాటు మరో నలుగురు రౌడీ షీటర్లను మారేడుపల్లి పోలీసులు, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో అడ్వకేట్ పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :- 9 ఏళ్లలో తెలంగాణలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు