చెరువులో ఈతకెళ్లిన చిన్నారి: బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబాతో మృతి

చెరువులో ఈతకెళ్లిన చిన్నారి: బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబాతో మృతి

కేరళకు చెందిన ఓ ఐదేండ్ల చిన్నారి బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబాతో మృతి చెందింది. బ్యాక్టీరియా వర్గానికి చెందిన ఒక రకమైన అమీబాతో ఈ వ్యాధి వస్తుంది. దీన్ని మెదడును తినేసే అమీబాగా పిలుస్తారు. ఈ వ్యాధి సోకినవారికి తొలుత తీవ్ర జ్వరం, తలనొప్పి, వాంతులు అవుతాయి. మే1, 10వ తేదీల్లో స్థానికంగా ఉన్న చెరువులో స్నానానికి వెళ్లినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. 

ఆ చెరువు నీటిలో ఉన్న ఫ్రీ లివింగ్‌ అమీబా చిన్నారి ముక్కులో నుంచి శరీరంలోకి వెళ్లి మెదడుపై తీవ్ర ప్రభావం చూపించినట్టు వైద్యులు గుర్తించారు. వ్యాధిని సకాలంలో కుటుంబసభ్యులు గుర్తించకపోవడం, వైద్య చికిత్స అందించడంలో అప్పటికే ఆలస్యమైంది. బాలిక మరణించినట్టు డాక్టర్లు వెల్లడించారు. గతంలో కూడా 2017, 2023లో రెండు సార్లు కేరళలో ఈ కేసులు బయటపడ్డాయి. వైద్య భాషలో ఈ వ్యాధిని అమీబిక్‌ మెనింగోన్సిఫాలిటీస్‌గా పిలుస్తారు.