శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీటి ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీటి ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. జలాశయంలో నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 37 వేల 647 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 826.40 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇన్ ఫ్లో 37 వేల 647 క్యూసెక్కులు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది శ్రీశైలంకు ముందుగానే వరద నీరు భారీగా వస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.