రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయం పెంపుపై దృష్టి పెట్టాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయం పెంపుపై  దృష్టి పెట్టాలి  :  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయ పెంపుపై దృష్టి సారించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. అన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సమానమైన పని పంపిణీ జరిగేలా చూడాలన్నారు. గురువారం సెక్రటేరియెట్‌లో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో మంత్రి సమావేశమై, రిజిస్ట్రేషన్‌ శాఖ పనితీరును సమీక్షించారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా త్వరితగతిన, పారదర్శకంగా నాణ్యమైన సేవలను అందించాల్సిన అవసరముందని చెప్పారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణాన్ని ప్రాధాన్యత ప్రాతిపదికన చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, అదనపు ఐజీ వెంకట్ రాజేశ్‌, జాయింట్ ఐజీ శ్రీనివాసులు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల డిప్యూటీ ఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.