రాజ్యాంగం ప్రకారం నడుచుకొండి

రాజ్యాంగం ప్రకారం నడుచుకొండి

కొల్ కతా : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ జగ్దీప్ ధన్కర్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీఎం మమతా బెనర్జీ ని ఉద్దేశించి రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలంటూ గవర్నర్ ట్విట్టర్ ద్వారా కోరారు. లాక్ డౌన్ మొదలైన నాటి నుంచి ఒక్కసారి కూడా మమతా బెనర్జీ రాష్ట్ర గవర్నర్ తో భేటీ అవ్వలేదు. దీనిపై గవర్నర్ ఆగ్రహంగా ఉన్నారు. రాజ్ భవన్ ను సెక్రటేరియేట్ లాక్ డౌన్ చేసిందంటూ గవర్నర్ కామెంట్ చేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళ్లర్పించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దీదీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహారిస్తున్నారంటూ ట్వీట్ చేశారు. “రాష్ట్రంలో పరిస్థితులను గవర్నర్ కు వివరించకుండా రాజ్ భవన్ తో లాక్ డౌన్ మాదిరిగా వ్యవహారించటం రాజ్యాంగ విరుద్ధం. అప్రజాస్వామికం” అంటూ ట్వీట్ చేశారు. మమతా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహారిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.