పంజాగుట్ట, వెలుగు: అమీర్ పేటలోని పలు స్వీట్షాపుల్లో ఫుడ్ సేప్టీ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. వాసిరెడ్డి ఫుడ్స్, వినూత్న ఫుడ్స్, ఢిల్లీ మిఠాయి వాలా, ఆగ్రా స్వీట్స్ షాపుల్లో గడువు ముగిసిన పదార్థాలు వాడుతున్నట్లు గుర్తించారు. స్వీట్ షాపుల్లో అమ్మే పదార్థాలకు ఎలాంటి లేబుల్స్, ఎక్స్పైరీ డేట్స్ వివరాలు ఉండకపోవడంతో హెచ్చరించారు. లైసెన్స్ రెన్యూల్ చేసుకోకపోవడం, కిచెన్పరిశుభ్రంగా ఉండడంతో నోటీసులు ఇచ్చారు.
