యువ ఫుట్బాలర్ పై మొసలి దాడి చేయడంతో అతను చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోస్టారికాలో జరిగిన ఈ ఘటన వివరాల ప్రకారం.. జీసస్ అల్బెర్టో లోపేజ్ ఒర్టిజ్(29)అనే ఫుట్బాలర్ని అందరూ ముద్దుగా చుచో అని పిలుస్తారు.
అతను స్థానికంగా ఉన్న నదిలో స్విమ్మింగ్చేసేందుకు దిగారు. కానీ అదే తన చివరి రోజవుతుందని ఊహించలేదు. ఈత కొడుతున్న అతన్ని పెద్ద మొసలి పసిగట్టింది. వేగంగా వచ్చి చుచోని తన నోటితో గట్టిగా పట్టేసుకుంది. దీంతో అతను తప్పించుకోవడానికి వీళ్లేకుండా పోయింది.
షాక్ లో ఉన్న చుచో దాని నుంచి విడిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ మొసలి విడిచిపెట్టలేదు. చివరికి మొసలి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అతని మృతదేహాన్ని మొసలి నోట కరచుకుని ఈదుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్అయ్యాయి. నది మొత్తం రక్తసిక్తంగా మారడంతో ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ ఫొటోలు చూసి కొందరు గన్లతో అక్కడికి వెళ్లారు. మొసలిని కాల్చి చంపి చుచో డెడ్బాడీని బయటకు తీశారు.
చుచో కొన్ని రోజులుగా డిపోర్టివో రియో కనస్ జట్టు తరఫున ఆడుతున్నాడు. 'అతని అకాల మరణం మమ్మల్ని షాక్కి గురి చేసింది. చుచో ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం' అని ఫుట్బాల్జట్టు ప్రకటనలో వెల్లడించింది. జట్టు సభ్యులు అతని కుటుంబాన్ని ఆదుకునేందుకు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు. చుచో అంతర్జాతీయంగా ఫుట్బాల్ ఆటలో అదరగొడుతున్నాడు. ఈ క్రమంలో విషాదం జరగడం క్రీడాభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చింది.