
హైదరాబాద్, వెలుగు: డొమెస్టిక్ క్రికెట్లో ఒకప్పటి మేటి ఆటగాళ్లలో ఒకడైన హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ (62) కన్నుమూశాడు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న అజీమ్ మంగళవారం తన నివాసంలో తుది శ్వాస విడిచాడు. రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది. ఫిబ్రవరిలో అజీమ్కు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. రైట్హ్యాండ్ ఎటాకింగ్ ఓపెనర్ అయిన అజీమ్ సౌత్ జోన్ నుంచి రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా, ఓవరాల్గా ఏడో క్రికెటర్గా నిలిచాడు. తన కెరీర్ లో 73 మ్యాచ్లు ఆడి 4644 రన్స్ చేశాడు.