ముషీరాబాద్/ ఉప్పల్, వెలుగు: దేశాభివృద్ధి ప్రణాళికలకు అత్యంత కీలకమైన సెన్సస్- 2027 (జనగణన) ప్రక్రియలో ప్రతి పౌరుడు స్వచ్ఛందంగా భాగస్వామి కావాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఆదివారం రాంనగర్లోని దత్తాత్రేయ నివాసానికి వచ్చిన జీహెచ్ఎంసీ అధికారులు ఆయన వివరాలను నమోదు చేయగా, తార్నాకలోని తన నివాసంలో శ్రీలతాశోభన్ రెడ్డి ఆన్లైన్ పోర్టల్ ద్వారా ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ పూర్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చే సమాచారం భవిష్యత్తు అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుందని, ప్రత్యేక యాప్ ద్వారా ఎవరికి వారు స్వయంగా వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు.

