125 గ్రామాల్లో ఈటల పాదయాత్ర

125 గ్రామాల్లో ఈటల పాదయాత్ర
  • 19 నుంచి ఈటల పాదయాత్ర
  • హుజూరాబాద్​లో 22 రోజుల పాటు పర్యటన

హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజూరాబాద్​లో ఈ నెల 19 నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. 22 రోజుల పాటు జరగనున్న ఈ యాత్రలో నియోజకవర్గంలోని మొత్తం 125 గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. రోజుకు 5 గ్రామాల్లో పర్యటించేలా ప్లాన్ రూపొందించారు. బై పోల్ నోటిఫికేషన్ వచ్చే నాటికి అన్ని గ్రామాల్లో పాదయాత్ర పూర్తి చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారానికి కేంద్ర హోం మంత్రి అమిత్​షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, పార్టీ అగ్రనేతలు ప్రచారానికి రానున్నట్లు తెలుస్తోంది. బై పోల్ నోటిఫికేషన్ ఈ నెలాఖరులో లేదా ఆగస్టులో వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.