రాజకీయ వికృత క్రీడలో జర్నలిస్టులను బలి చేస్తరా? : మాజీ మంత్రి హరీశ్ రావు

రాజకీయ వికృత క్రీడలో జర్నలిస్టులను బలి చేస్తరా? : మాజీ మంత్రి హరీశ్ రావు
  • అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా?
  • ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ?


హైదరాబాద్: పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మీ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమ కారులైన జర్నలిస్టులను బలి చేస్తారా? అని ఫైర్అయ్యారు. ఇండ్లల్లోకి చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్ర వాదులా? అని మండిపడ్డారు. 

'జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నం. ఇది ప్రజాస్వామ్యంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాడి. తెలంగాణ జర్నలిస్టుల ఆత్మ గౌరవంపై పని గట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడి ఇది. జర్నలిస్టుల అరె స్టులు, మీడియా డిజిటల్ మీడియాపై సిట్లతో ఎవర్నికాపాడుతున్నారు? ఎవరిని వేటాడుతున్నారు? 

మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజా స్వామ్య హననానికి పాల్పడటం దుర్మార్గం. రేవంత్ రెడ్డి.. ఇదేనా నీ ప్రజాపాలన? ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ? అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణం విడుదల చేయాలి' అని డిమాండ్ చేశారు.