పొత్తులపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పొత్తులపై  మాజీ మంత్రి  నిరంజన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

లోక్ సభ ఎన్నికల్లో పొత్తులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్  సీనియర్ నేత నిరంజన్ రెడ్డి. పొత్తులపై పార్టీల అధినేతలు చూసుకుంటారని చెప్పారు. రాష్ట్రంలో మాట్లాడే నేతలు పొత్తులపై నిర్ణయం తీసుకోరన్నారు నిరంజన్ రెడ్డి. కొన్ని రోజులుగా బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పై ఊహాగానాల నేపథ్యంలో నిరంజన్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. 

మరోవైపు బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు రెడీ అయిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పొత్తుపై ఢిల్లీలో బీజేపీ నేతలు తనతో చెప్పారన్నారు.  ఫిబ్రవరి 22న కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పని ఖతమైందని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 12 పైగా సీట్లు గెలుస్తుందన్నారు కోమటిరెడ్డి.