
జనారెడ్డి పెట్టిన బిక్షతో కేసీఆర్ సీఎం అయ్యారన్నారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. జనారెడ్డికి పరిమినేట్ రెస్ట్ ఇవ్వడం మంచిదని కేసీఆర్ అనడం సరికాదన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా కండిస్తున్నారని.. తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం జానారెడ్డి అన్నారు. జానారెడ్డికి సీఎం పదవి ఆఫర్ ఇచ్చినా తీసుకోలేదని.. నాకు సీఎం పదవి ఇస్తే తెలంగాణ రాదు అని చెప్పారన్నారు. జనారెడ్డి ఇన్నేళ్ల రాజకీయంలో కొడుకులని కానీ.. కుటుంబ సబ్యులని ఎవరని రాజకీయాల్లోకి తీసుకురాలేదు చెప్పారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారని.. ఇటీవల కేసీఆర్ పామ్ హౌస్ లో ఆరు మండలాలకు ఐదు కోట్లు ఇచ్చారన్నారు. నాగార్జునసాగర్ ఎన్నికకు రూ. 100 కోట్లు ఖర్చు పెట్టనున్నారని తెలిపారున షబ్బీర్ అలీ.
జానారెడ్డి మచ్చ లేని నాయకుడని..జానారెడ్డిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలన్నారు. కాగ్ రిపోర్ట్ తెలంగాణ ప్రభుత్వం మీద సీరియస్ అయిందని..కాంగ్రెస్ చెబితే మీరు ఆరోపిస్తున్నారన్నారు. పదివేల కోట్ల స్కామ్ జరిగిందని కాగ్ చెప్పిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎంక్వైరీ వేసి..ఏ డిపార్ట్ మెంట్స్ లో ఎంత అవినీతి జరిగిందో .. దేశంలోని ఏ రాష్ట్రంపై కూడ కాగ్ ఇంత స్థాయిలో ఎలిగేషన్ చేయలేదన్నారు. అప్పులు తీసుకొచ్చి రెవెన్యూ అని చెపుతున్నారని ..ఇప్పటికే నాలుగు లక్షల కోట్లపైనే అప్పులు చేశారన్నారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ శాశ్వతంగా పామ్ హౌస్ కే పరిమితమయ్యారని తెలిపారు. జానారెడ్డి సీఎం పదవి తీసుకుంటే తెలంగాణ రాదని ఆ పదవిని త్యాగం చేశారని గుర్తు చేశారు. రాజకీయాలకే జానారెడ్డి ఒక దిక్సూచి లాంటి వారన్నారు. జనారెడ్డి పెట్టిన బిక్షతో కేసీఆర్ సీఎం అయ్యారుకేసీఆర్ ..మీ మాటలు, మీ డబ్బు జానారెడ్డి ముందు పని చేయవన్నారు. కేసీఆర్ రాజకీయ పతనం దుబ్బాకలో ప్రారంభమైందని ..నాగర్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత పూర్తిగా రెస్ట్ ఇస్తామన్నారు.