వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచే పోటీ చేస్తా

వచ్చే ఎన్నికల్లో  పాలేరు నుంచే పోటీ చేస్తా

వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచే పోటీ చేస్తానన్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. పాలేరును కులమతాలు, పార్టీలకతీతంగా అభివృద్ధి చేశానన్నారు. గ్రామాల్లో సమస్యలను తన దగ్గరకు రానివ్వటం లేదని కామెంట్స్ చేశారు తుమ్మల. ప్రజాసమస్యలు పరిష్కరించే శక్తి తనకు ఉన్నట్లు చెప్పాడు. ప్రజల కోరికతో, పార్టీ నిర్ణయంతో మళ్లీ ప్రజల ముందుకొస్తానన్నారు తుమ్మల. నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరులో జరిగిన  ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన తుమ్మల ఈ వ్యాఖ్యలు చేశారు.